Monday, May 20, 2024

మద్యం మలాస పట్టుబడింది

తప్పక చదవండి
  • ఆబ్కారీ శాఖ అధికారులకు అప్పగించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం
  • అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఆబ్కారీ అధికారులు..!!
  • వార్త సేకరణకు వెళ్లిన విలేకరులకు అడ్డు తగిలిన వైనం..

వికారాబాద్‌ : వికారాబాద్‌లో మద్యం బాటిళ్లు బారీ స్థాయిలో పట్టు బడ్డాయి. వికారాబాద్‌ పట్టణం నుండి ఓ గ్రామానికి మద్యం బాటిళ్లు వాహనంలో తరలిస్తుండగా వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో రైల్వే గేటు వద్ద (టీఎస్‌34సీ4250) నెంబర్‌ గల కారులో ఓ పార్టీ కి చెందిన 62 లీటర్ల, బీరు సీసాలు, 8 లీటర్ల ఆల్కహాల్‌ ను పట్టుకొని అబ్కారీ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎన్నికల నిఘా అధికారి కృష్ణరావు తెలిపారు. పట్టుబడిన కారులో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ప్రచార స్టిక్కర్స్‌ ఉండడం చూస్తే బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు మద్యం తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పై సంబంధిత అధికారులను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతూ వార్త సేకరణ కోసం వెళ్లి ఫోటోలు తీస్తున్న విలేకరులకు అడ్డుపడి బీఆర్‌ఎస్‌ పార్టీ స్టిక్కర్‌లు తొలగించడం చూస్తే అధికార పార్టీ కి ఆబ్కారీ అధికారులు కొమ్ము కాస్తున్నట్టు స్పష్టం అవుతుంది.ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు