Saturday, May 18, 2024

భారత్‌లో పెరిగిన కుబేరులు..టాప్‌లో మళ్లీ అంబానీ

తప్పక చదవండి

న్యూఢిల్లీ : భారత్‌లో సామాన్యులు ఆదాయాలు లేక.. అధిక ధరలతో విలవిలలాడుతోంటే.. మరోవైపు కుబేరులు మాత్రం ఊహించని రీతిలో పెరిగిపోతున్నారు. సంఖ్యా, ఆదాయ పరంగాను భారీగా పెరిగారు. ఏటేటా వేల కోట్లు పోగేసుకుంటున్నారు. ఈ వారం మొదట్లో విడుదలైన ‘360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023 నివేదికలో ఈ విషయం వెల్లడయింది. ఆగస్టు 30 నాటి సంపద ఆధారంగా దేశ వ్యాప్తంగా 1,319 మందితో కూడిన ధనవంతుల జాబితాను హురున్‌ విడుదల చేసింది. లిస్టెడ్‌ కంపెనీల షేర్‌ ఆధారంగా, అన్‌లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించి ఇన్వెస్టర్‌ రౌండ్‌ల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. హురున్‌ రిపోర్ట్‌ ప్రకారం.. భారత్‌లో గత ఏడాది కాలంలో ప్రతి మూడు వారాలకు ఇద్దరు బిలియనీర్లు పుట్టుకొచ్చారు.ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో ఈ సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. హురున్‌ జాబితాలో ఉన్నవారిలో 51 మంది సంపద వార్షిక ప్రాతిపదికన రెండిరతలు పెరిగింది. గతేడాదిలో ప్రతీ 10 మందిలో ఎనిమిది మంది ఆదాయాలు పెరిగాయి. ఈ జాబితాలో గౌతం అదానీని అధిగమించి రిలయన్స్‌ ఇండిస్టీస్ర్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ అగ్రస్థానానికి చేరుకున్నారు. దీంతో భారత్‌లో మళ్లీ అత్యంత ధనవంతుడిగా అంబానీ నిలిచారు. అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతం అదానీ సంపదకు హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బ కొట్టింది. దాని ఫలితమే అదానీకి ఈ పరిస్థితి వచ్చింది. ఆయన సంపద 57 శాతం పతనమై రూ.4.74 లక్షల కోట్లకు పడిపోయింది. ప్రస్తుత ఏడాదిలో ముకేష్‌ అంబానీ సంపద రెండు శాతం పెరిగి రూ.8.08 లక్షల కోట్లకు చేరింది. హురున్‌ జాబితాలో సీరం ఇన్స్‌ట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా దేశంలో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. గతేడాది పోలిస్తే ఆయన సంపద 36 శాతం ఎగిసి రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. తర్వాత హెచ్‌సిఎల్‌ టెక్‌కు చెందిన శివ్‌ నాడార్‌ సంపద 23 శాతం ఎగబాకి రూ.2.28 లక్షల కోట్లకు పెరగడంతో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో గోపిచంద్‌ హిందుజా, దిలీప్‌ సంఫ్వీు, లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌, రాధాకృష్ణన్‌ దమానీ, కుమార్‌ మంగళం బిర్లా, నీరజ్‌ బజాజ్‌ నిలిచారు. బైజూస్‌ అధినేత రవీంద్రన్‌కు ఈ దఫా జాబితాలో చోటు దక్కలేదు. ఇకామర్స్‌ వేదిక జెఎª`టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోరా ఈ జాబితాలో అత్యంత చిన్న వయస్కుడుగా ఉన్నారు. 20 ఏళ్ల వోరా రూ.1,000 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. 94 ఏళ్ల వయసులో ప్రెసిషన్‌ వైర్స్‌ ఇండియాకు చెందిన మహేంద్ర రతిలాల్‌ మెహతా హురున్‌ ధనవంతుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా ముంబయి నుంచి హురున్‌ ధనవంతుల జాబితాలో 328 మంది చోటు దక్కించుకున్నారు. తర్వాత ఢిల్లీ 199, బెంగళూరు 100మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫార్మాస్యూటికల్‌ రంగం నుంచి 133 మంది, రసాయనాలు, పెట్రోకెమికల్స్‌ రంగం నుంచి 119 మంది, పారిశ్రామిక ఉత్పత్తుల రంగం నుంచి 96 మంది చొప్పున బిలియనీర్లు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు