Tuesday, May 14, 2024

నిరుపేద కుటుంబానికి అండగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..

తప్పక చదవండి
  • నిరుపేద కుటుంబానికి చెందిన గుడిసెను పీకేసిన బీ.ఆర్.ఎస్. లీడర్..

జనగామ : జనగామ పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ దగ్గర రోడ్ మీద గుడిసె చేసుకుని నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ దౌర్జన్యంగా గుడిసెను పీకేసి రోడ్డున పడేయడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడద్దని మీకు నేను అండగా ఉంటానని తెలిపి, ఆర్థిక సహాయాన్ని అందించారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. అలాగే పిసిసి మెంబర్ చెంచాల శ్రీనివాస్ రెడ్డిని, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, జనగామ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ యం.డి. అన్వర్ లను వారి నివాసంలలో మర్యాదపూర్వకంగా కలిశారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

వారితో పాటు జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, కంచ రాములు, చారబుడ్ల దయాకర్ రెడ్డి, పీ.ఏ.సి.ఎస్. వడ్లకొండ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, ఉడత రవి యాదవ్, మేడ శ్రీనివాస్, మంత్రి శ్రీశైలం, మోటె శ్రీనివాస్, బోట్ల నర్సింగరావు, పిట్టల సతీష్, ఆకుల లక్ష్మయ్య, బొరేల్లి సిద్ధులు, కుమార్, దాసరి క్రాంతి, బక్క ప్రవర్దన్, గాజుల రాజు, తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు