Saturday, May 4, 2024

బీసీల తలరాత మారుతుంది అనుకున్నాం

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఓబీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌ కల్పించే విధంగా చట్టాలు తీసుకు రావాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని, అదేవిధంగా బిల్‌ కోసం సబ్‌ కోటా ఉండాలని తీర్మానం చేశామని ఆనాటి నుండి కేసీఆర్‌ బీసీ ల ఉద్యమానికి సపోర్ట్‌ చేశారని తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌ ఛైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ సీఎం కేసీఆర్‌ ను కొనియాడారు. బుధవారం హరిత ప్లాజాలో బీసీ మేధావులు, ఉద్యమకారులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే చిత్త శుద్ధి తో ఇప్పటికీ బిసి లకు న్యాయం జరగాలని కోరుకుంటున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు రెండు బీసీ వ్యతిరేక పార్టీలుగా ఆయన పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం చేసే పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నేడు తీర్మానం చేసామని గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు