Thursday, May 2, 2024

అమితాషాకు రిఫార్మ్ టు ద నేషన్ బుక్ ని బహూకరించిన బీజేపీ మహిళా..

తప్పక చదవండి

మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి..

  • మాజీ ప్రధాని పీవీ నుంచి నరేంద్ర మోడీ వరకు పాలనా సంస్కరణల సంకలనం..

హైదరాబాద్ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు విచ్చేశారు. ఆ సందర్భంగా బేగం పేట్ విమానాశ్రయoలో సాయంత్రం వీడ్కోలు చెబుతూ.. బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి ‘ రిఫార్మ్ టు ద నేశన్ ‘ అనే పుస్తకాన్ని అమిత షా కి బహూకరించారు. మాజీ ప్రధాన మంత్రి సర్గీయ పి.వి. నరసింహ రావు నుండి నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు.. ప్రధాన మంత్రులు చేపట్టిన పాలనా సంస్కరణల సంకలనం గల పుస్తకాన్ని బహూకరిస్తూ.. గీతా మూర్తి, కేంద్ర హోమ్ శాఖా మంత్రికి తెలంగాణ మహిళా మోర్చా చేపట్టిన కార్యక్రమాల గురించి సంక్షిప్తంగా వివరించారు. అమిత్ షా సంస్కరణల పుస్తకాన్ని పరిశీలించి.. కొద్ది సేపు ఆమెతో మాట్లాడారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు