Monday, May 6, 2024

ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యా యత్నం..

తప్పక చదవండి
  • సూసైడ్ అటెమ్ట్ చేసిన నిరుపేద దంపతులు..
  • అధికారుల అప్రమత్తంతో తప్పిన ప్రమాదం..
  • బాధితులు నిజాంసాగర్ మండల వాసులుగా గుర్తింపు..

హైదరాబాద్ : డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతూ.. నిజాం సాగర్ మండలానికి చెందిన నిరుపేద దంపతులు గురువారం రోజు, హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాస భావనమైన ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు.. ఈ క్రమంలో తమ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు.. ఇది గమనించిన ప్రగతి భవన్ సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.. కాగా వీరు నిజాం సాగర్ మండలానికి సంబంధించిన మహేందర్ దంపతులుగా గుర్తించారు అధికారులు.. ఈహతే డబుల్ బెడ్ రూమ్ మంజూరు అయ్యిందని మొదట స్థానిక నాయకులు తెలిపారని.. ఆ తరువాత తమకు మంజూరైన ఇంటిని వేరొకరికి కేటాయించారని వారు ఆరోపిస్తున్నారు.. తమకు మంజూరైన ఇంటిని తమకు తిరిగి కేటాయించాలని వారు ప్రాధేయపడుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు