Sunday, May 19, 2024

తనను చాలా మిస్సవుతున్నా

తప్పక చదవండి
  • ట్విటర్‌లో తన కొడుకుతో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్‌ అమెరికాకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో హిమాన్షుతో జాగింగ్‌ చేస్తూ దిగిన పాత ఫొటో ఒకదాన్ని షేర్‌ చేశాడు. ఆ ఫొటోతో పాటు ‘ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా అనే క్యాప్షన్‌ను మంత్రి ఇచ్చారు. క్యాప్షన్‌ పక్కన లవ్‌ సింబల్‌ను జత చేశారు. కాగా, మంత్రి కేటీఆర్‌ గతంలో కూడా తన కుమారుడి గురించి ఓ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. హిమాన్షు అమెరికాకు ఒంటరిగా వెళ్లడం లేదని, అతనితోపాటు తనలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడని ఆ ఎమోషనల్‌ ట్వీట్‌లో మంత్రి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు