జోహన్నెస్బర్గ్ : మహాత్మా గాంధీ 8 అడుగుల విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో ఉన్న టాల్స్టాయ్ ఫార్మ్లో ఆదివారం ఆవిష్కరించారు. సుప్రసిద్ధ శిల్పి జలంధ ర్నాథ్ రాజారామ్ చన్నోలే తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని భారత హై కమిషనర్ ప్రభాత్ కుమార్ ఆవిష్కరించారు. గాంధీజీ ఇక్కడ 1910`1914 మధ్య కాలంలో నివసించారు. దక్షిణాఫ్రికాలోని వివక్షపూరిత చట్టాలకు వ్యతిరేకంగా పోరాడేవారి కోసం కూరగాయలు వంటి ఆహార ఉత్పత్తులను ఈ ఫార్మ్లో పండిరచేవారు. ఈ భూమిని గాంధీజీ స్నేహితుడు హెర్మన్ క్లలెన్బచ్ విరాళంగా ఇచ్చారు.