Wednesday, May 15, 2024

చేయూత పథకంతో పోలీస్‌ కుటుంబాలకు అండ

తప్పక చదవండి
  • జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సూర్యాపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌) : పోలీస్‌ శాఖలో సిబ్బంది కోసం అమలు చేస్తున్న చేయూత పథకం వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని జిల్లా యస్‌.పి రాహుల్‌ హెగ్డే అన్నారు.సూర్యపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ అంజయ్య అనారోగ్యంతో ఆకాలంగా మృతి చెందారు. పోలీసు కుటుంబ సంక్షేమంలో భాగంగా అంజయ్య కుటుంభ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును చేయూత పథకం ద్వారా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అందచేశారు.ఈ చేయూత పథకానికి ప్రతి నెల విరాళాలు అందిస్తున్న జిల్లా సిబ్బందిని అభినందిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌ గౌడ్‌,ఆర్‌.ఎస్‌. ఐ అశోక్‌ ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు