Monday, April 29, 2024

కోటా శ్రీనివాస్ కి ఘన సన్మానం..

తప్పక చదవండి
  • రాజకీయాలకు అతీతంగా అభినందనలు..

హైదరాబాద్: టీ.పీ.సీ.సీ. ప్రచార కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ గా నియమితులైన ఓయూ రీసర్చ్ స్కాలర్ తెలంగాణ ఉద్యమకారుడు కోటా శ్రీనివాస్ ని ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఘనంగా రాజకీయాలకు అతీతంగా సన్మానించారు.. ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ రాజకీయాల్లో ఉన్న పీడిత ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉంటూ తెలంగాణ సమాజాన్నీ మోసం చేసి, తాకట్టు పెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఓయూకి సముచిత స్థానం పెద్దపీట కల్పించే విధంగా తోడ్పాటు చేస్తానని మాట్లాడటం జరిగింది.. ఈ సన్మాన కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, టి.ఎస్.యు. ఓయూ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్. టి.ఎస్.ఎఫ్. విద్యార్థి సంఘం భారి అశోక్.
ఎన్ఎస్.యూ.ఐ. వెంకట్, అక్బర్, ఆదివాసి స్టూడెంట్ ఫోరం బట్టు వెంకటేశ్వర్లు, రీసెర్చ్ స్కాలర్స్ మాండ్ల రవి, అజయ్ తాళ్ల, పెంచాల సతీష్, సునీల్ నిరడి, కరణ్, హనుమంతు, కోటేశ్వర్, శివ, సుమంత్, శశి, వేణు, భాష, రంగు సుధాకర్, బాలు నాయక్, రాజబాబు, మహేందర్ వివిధ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు