- ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్, కుషాయిగూడ పోలీసులతో కలిపి ఆపరేషన్..
హైదరాబాద్ : ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్ బృందం.. కుషాయిగూడ పోలీసులతో కలిసి, రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్కు హెరాయిన్ డ్రగ్ను రవాణా చేసి, అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద నుండి దాదాపు (100) గ్రాముల హెరాయిన్ డ్రగ్ను కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు : హెరాయిన్ డ్రగ్ – (100) గ్రాములు.. సెల్ ఫోన్లు : 06.. ఒక బైక్.. నికర నగదు రూ 820/-.. సుమారు రూ.12,00,000/- విలువ చేసే మందు మొత్తం స్వాధీనం చేసుకున్నారు.