Thursday, May 2, 2024

ఉస్సేన్ సాగర్ లో పిండ ప్రధానం చేసిన బక్కా జడ్సన్..

తప్పక చదవండి

హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిన ప్రభుత్వానికి పిండ ప్రధానం చేశారు బక్క జడ్సన్.. బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకొని రీ డిజైన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయలను దోచుకున్నారనడానికి నిదర్శనమే కాలేశ్వరం మేడిగడ్డ లో 20వ పిల్లర్ కుంగడమని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్ బక్క జడ్సన్ ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఆగమ్య గోచరంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని బంగారు తెలంగాణ పేరుతో సుమారు 10 ఏళ్ల కాలం తెలంగాణ ప్రజలను మోసం చేశారని మాయమాటలతో మాటల గారడీతో నాడు తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది విద్యార్థులను బలి కొన్నారని నేడు తెలంగాణ ప్రజల ఆస్తులను, ప్రజాధనాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నారని బక్క జడ్సన్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీటి వనరులకు కట్టిన ప్రాజెక్టులు నాగార్జునసాగర్ వంటి ఎన్నో నేటికి మన కళ్ళ ముందు పటిష్టంగా కనపడుతున్నాయని, బిఆర్ఎస్ ప్రభుత్వం వారి స్వప్రయోజనాలకు కుటుంబ పాలనతో ప్రజలను మోసం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని గతంలోనే కాలేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని రీ డిజైన్ పేరుతో ఈ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదని సిబిఐ, ఈడి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమని, ఈ రాష్ట్రాన్ని దేశంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలు రెండు కలిసికట్టుగా వ్యూహాత్మకంగా ప్రజా ధనాన్ని, ఆస్తులను దోచుకుంటున్నారని అనడానికి నిదర్శనమే నేటి వరకు కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోకపోవడం అని ఆరోపించారు.

- Advertisement -

తెలంగాణ ప్రజలు ఆలోచించాలని హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కాలేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు దోచుకోవడం వల్లనే మేడిగడ్డ లో 20 పిల్లర్ క్రుంగి పోవడం అని ఈ ప్రభుత్వానికి ఈసారైనా తగిన బుద్ధి చెప్పాలని, ప్రజలందరూ ఆలోచించాలని పిండ ప్రధానం చేశానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో యువత ఎన్నో కష్టాలు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో పేపర్ల లీకేజీ చేయడం వల్ల యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లు లీకై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టింపు లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ కేసులో అరెస్టు అనగానే రాష్ట్ర ప్రభుత్వమంతా కదిలి నాడు ఢిల్లీలో మకాం వేయడం సిగ్గుచేటని, సొంత పాలన కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే బంగారు తెలంగాణ పేరుతో మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలను రాష్ట్రంలో దోచుకున్నారని, ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలంతా చమర గీతం పాడాలని కోరుతూ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో పిండ ప్రధానం చేయడం జరిగిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల కళ కన్నతల్లిలా తన పిల్లల ఆత్మ బలిదానాలను ఆపాలని చలించిపోయి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ సర్వం కోల్పోయి, దేశంలో అన్ని రాజకీయ పార్టీలను పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయుటకు ఒప్పించి రాష్ట్రమిస్తే.. నేడు రాష్ట్రంలో జరుగుతున్న వైనాన్ని ప్రజలు ఆలోచించాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఆలోచించాలని బక్క జడ్సన్ కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు