అమరావతి : బ్రతుకు తెరువు కోసం ఆక్వాకల్చర్పై ఆదారపడ్డ దంపతులకు అప్పులు ఎక్కువై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెంది నాగబాబు(30), అనూష(28) దంపతులు . ఇటీవల ఆక్వాసాగులో నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు. దీంతో అప్పులు తీర్చలేక చనిపోతున్నట్లు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆక్వాసాగులో నష్టం వచ్చిందని , అప్పులు ఎక్కువ తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో దంపతులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.