- మైనార్టీ సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
- ముస్లింలను కాంగ్రెస్ కడుపులో పెట్టుకుంటుంది
- 12 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ ఝూట మాట
- కుతుబ్ షాహీ మసీదులోమందముల పరమేశ్వర్రెడ్డి ప్రార్థనలు
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్) : కాలనీలు, బస్తీ లలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమే శ్వర్ రెడ్డి అన్నారు. మురికివాడల ప్రజలు, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు, యువత, మహి ళలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వివరించారు. మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్య పడుతుందని పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ భగత్ కుతుబ్ షాహి మసీదులో శుక్రవారం ప్రచారం చివరి కావడంతో ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని ఆశా భవం వ్యక్తం చేశారు. విద్యారంగంలో మైనార్టీ యువతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.
ఉప్పల్ లో హిందువులు, ముస్లింలు సోదర భావంతో ఒకే కుటుంబం జీవిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినట్లు గుర్తు చేశారు. పదేళ్ల తర్వాత చూస్తే తెలంగాణాలో కేసీఆర్ కుటుంబానికి లాభం కలిగిందని, ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. రైతుల రుణమాఫీ, నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నెల నెల 2500 రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఎలాంటి అవినీతి మరకలేని తమకు అవకాశాన్ని ఇచ్చి అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
12 శాతం ముస్లిం రిజర్వేషన్లు కేసీిఆర్ దొంగ మాటలు..
తెలంగాణ ఉద్యమ సమయంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కనిపి స్తామని కెసిఆర్ దొంగ మాటలు చెప్పారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే ముస్లింలకు పెద్దపీట వేస్తామని పరమేశ్వర్రెడ్డి హా మీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.