Saturday, May 18, 2024

కరప్షన్‌కు కేరాఫ్‌ కాంగ్రెస్‌

తప్పక చదవండి
  • నమ్మి ఓటేస్తే కర్ణాటక ప్రజలను నట్టేట ముంచారు
  • తెలంగాణకు కాంగ్రెస్‌ గాడ్సెను నమ్ముకుంది
  • పదేళ్లుగా గిరిజన యూనివర్సిటీలపై రాహుల్‌ ఎందుకు నోరెత్తలేదు
  • కాంగ్రెస్‌ మాటలకు బోల్తాకొట్టే వారు తెలంగాణలో లేరు
  • వైఫల్యాల కాంగ్రెస్‌ను ఎవరూ విశ్వసించరు
  • ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ నిప్పులు చెలరేగిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ : నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరప్షన్‌కు కేరాఫ్‌ కాంగ్రెస్‌ పార్టీ అని.. కవిూషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధిస్తున్నారని, ఇక్కడికొచ్చి నీతి వాక్యాలు వల్లెవేస్తున్నారా అని రాహుల్‌ గాంధీపె ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ తెలంగాణకు ఎప్పుడూ విలనేనని, గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించినప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా దుయ్యబట్టారు. గత పదేండ్లుగా గిరిజన యూనివర్సిటీపై రాహుల్‌ ఎందుకు నోరెందుకు మెదపలేదని నిలదీశారు. విభజన హావిూలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. ‘కాంగ్రెస్‌ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్‌ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్‌ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హావిూలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హావిూలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ విూది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హావిూలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్‌ కూడాఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు విూరు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు..కరప్షన్‌ కు కేరాఫ్‌ కాంగ్రెస్‌. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా??. దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టింది విూరు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే వందల మంది బలిదానాలకు కారణం. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ల్యాండ్‌ మాఫియాకు కేరాఫ్‌ విూ పీసీసీ చీఫ్‌. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు.. రేవంతు..రిమోట్‌ పాలన గురించి విూరా మాట్లాడేది..??, రిమోట్‌ కంట్రోల్‌ పాలనకు కేరాఫ్‌ విూ టెన్‌ జనపథ్‌.. మా ప్రభుత్వ రిమోట్‌ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది.. విూ గాంధీభవన్‌ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. మూడు రోజుల పర్యటన చేసినా మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మరు. వైఫల్యాల కాంగ్రెస్‌ను ఎప్పటికీ విశ్వసించరు’ అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు