Monday, April 29, 2024

ఎల్బీ స్టేడియంలో సిఎం ప్రమాణ స్వీకారోత్సవం

తప్పక చదవండి
  • ఏర్పాట్లపై సిఎస్‌ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష
  • ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం

హైదరాబాద్‌ : ఎల్‌బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్‌ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సి.ఎస్‌ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్‌, పార్కింగ్‌, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలి. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్‌ చేయడం వంటివి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదేవిధంగా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్యా, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ఓ రిజ్వీ, శైలజా రామయ్యర్‌, గవర్నర్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ శ్రీనివాస్‌ రాజు, కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. తరవాత ఏర్పాట్లపై సీ.ఎస్‌ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఎల్‌.బి. స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, అడిషనల్‌ డీజి లు సీ.వి.ఆనంద్‌, శివధర్‌ రెడ్డి, నగరపోలీస్‌ కమీషనర్‌ సందీప్‌ శాండిల్యా, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్‌, రిజ్వి, జలమండలి ఎం.డి దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార శాఖ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌, రాజ్‌ భవన్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌ , వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మల్లు రవి, వెం నరేందర్‌ రెడ్డి,అంజన్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీమతి మున్సీ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్‌ శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు, స్టేడియంలో మంచినీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్టాల్ర ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని, వారికి ప్రత్యేకంగా గ్యాలరీలతోపాటు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వాహనాల పార్కింగ్‌, బందోబస్త్‌ లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు