Monday, May 20, 2024

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి

తప్పక చదవండి
  • బీజేపీ ఎంపీ బండి సంజయ్‌

కరీంనగర్‌ : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి అని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఇసుక కుప్పలు కన్పిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని… ఖాళీ జాగాలు కన్పిస్తే కబ్జాలు చేస్తున్నారన్నారు. యువతను మంత్రి గంగుల కమలాకర్‌ గంజాయి మత్తులో ముంచుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు గల్లీలో తిరుగుతుంటే జనమే నిలదీస్తున్నారన్నారు. ఓట్ల కోసం ఓటుకు రూ.10 వేలు పంచేందుకు సిద్ధమయ్యాడని బండి సంజయ్‌ పేర్కొన్నారు. లక్ష సెల్‌ ఫోన్లు పంచేందుకు గంగుల కమలాకర్‌ సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. గంగుల ఓటమి ఖాయమని కేసీఆర్‌కు ఎప్పుడో తెలుసన్నారు. అందుకే ఒవైసీ వద్ద మోకరిల్లి పచ్చజెండా పట్టుకున్నాడన్నారు. భూకబ్జాలు తప్ప కాంగ్రెస్‌ చేసిందేమిటని బండి సంజయ్‌ ప్రశ్నించారు. మందికి పుట్టిన పిల్లలను తమ పిల్లలుగా చెప్పుకునే రకం గంగుల అని విమర్శించారు. గంగుల కమలాకర్‌ మళ్లీ గెలిస్తే జీతాలు, ఫించన్లు రావన్నారు. మా అత్త చనిపోయిందని ఇంటికొస్తే కేసీఆర్‌, గంగుల కుట్ర చేసి తనను జైలుకు పంపారని బండి సంజయ్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు