Wednesday, May 22, 2024

మృతుని కుటుంబానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం పరామర్శ..

తప్పక చదవండి

జనగామ : జనగామ జిల్లా, పెద్దపాడు గ్రామానికి చెందిన పొల్లోజు రాములు(40) అనారోగ్యానికి గురై హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.. బాధితునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. చాలా పేద కుటుంబం.. రెక్క ఆడితే గాని, డొక్క ఆడని కుటుంబం.. కూలిపని చేసుకుంటూ.. జీవనం కొనసాగిస్తున్నారు.. మృతునికి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు.. టెంట్ వేసి మృతుని ఉంచాల్సిన దీన దయ పరిస్థితి.. ఈ మరణ వార్త విన్న భారత రాష్ట్ర సమితి, జనగామ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం.. నామాల సారయ్య టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, జాఫర్ గూడెం రవి ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సరికొండ సురేందర్ రెడ్డి, మృతుని కుటుంబానికి 25 కిలోల బియ్యం సహాయం చేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజగోపాల్, సిద్ధులు, జడల రాజు, రాజేశ్వర్ రెడ్డి, నామాల అశోక్, భీష్మ చారి, బాల్ లింగం, గడి బండ కృష్ణమూర్తి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూస రమేష్ యాదవ్, యూత్ సభ్యులు పాల్గొని పరామర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు