Saturday, July 27, 2024

ఎన్.ఎస్.యూ.ఐ. ముఖ్య కార్యకర్తల సమావేశం..

తప్పక చదవండి

జనగామ : చేర్యాల మండల అధ్యక్షులు జంగా అభిషేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల ఎన్.ఎస్.యూ.ఐ. ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఎన్.ఎస్.యూ.ఐ. జనగామ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభి గౌడ్. జిల్లా ఆదక్షులతో పాటు ముఖ్య అతిధులుగా ఓబీసీ చైర్మన్ జానకి స్వామి, టౌన్ అధ్యక్షులు చింతల మల్లేశం, కిసాన్ సెల్ మండల అద్యక్షులు సూర్న శ్రీకాంత్, పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పని చేసే యువకులకు ఎన్.ఎస్.యూ.ఐ.లో ఎప్పుడు గౌరవ ప్రధమైన హోదా కల్పిస్తామని తెలియజేస్తున్నాం అన్నారు. పేద ప్రజలు, విద్యార్థులు, యువకులు కనీస సదుపాలైన విద్య, వైద్యం అందనియకుండా చేయడమే కాకుండా, సామాజిక పరంగా, ఆర్ధిక పరంగా పేద, మధ్య తరగతి వాళ్లని ఎదగనియకుండా చేస్తున్న ఈ బీ.ఆర్.ఎస్. నాయకులని తరిమికొట్టి కాంగ్రేస్ ని గెలిపించాలని కోరుతున్నాం అన్నారు. కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన 6 హామీలని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పి పార్టీ గెలుపు కోసం కృషి చేయవలసిన బాధ్యత ఎన్ . ఎస్ . యూ. ఐ. సైనికులుగా మన అందరి మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, జనగామ మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ ధీరజ్, జనగామ టౌన్ అధ్యక్షులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు