Sunday, May 19, 2024

చిలిపిచేడ్‌లో కమలం పువ్వు వికసించింది..

తప్పక చదవండి
  • గౌతాపూర్‌ ఎంపీటీసీి సునీతా దేవ్లా నాయక్‌
  • రఘువీర్‌ రామిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక

చిలిపిచేడ్‌ : చిలిపిచేడ్‌ మండలంలో కమలం పువ్వు వికసిం చిందని గౌతాపూర్‌ ఎంపీటీసి సునీతా దేవ్లానాయక్‌ పేర్కొన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీర్‌ రామిరెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. చిలిపిచేడ్‌ మండలం గౌతాపూర్‌ ఎంపీటీసీ సునీతాదేవ్లా నాయక్‌ బిఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాషాయ కండువాను దుబ్బాక శాసనసభ సభ్యులు రఘునందన్‌ రావు చేతుల మీదుగా కప్పుకోవడం జరిగిందని తెలిపారు.అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్‌ మల్లేష్‌ గౌడ్‌,జిల్లా ఎస్టి మోర్చా ఉపాధ్యక్షులు కిషన్‌ నాయక్‌,జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గుండం శంకర్‌,జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, చిలిపిచెడ్‌ మండలం బిజెపి పార్టీ అద్యక్షులు దశరత్‌,శివ్వంపేట మండల అద్యక్షులు రవిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి సంతోష్‌, ఉపాద్యక్షుడు శ్రీనివాస్‌, వెంకటేష్‌, బీజేవైఎం అద్యక్షులు సత్యం, అజ్జమర్రి మాజీ సర్పంచ్‌ నగేష్‌, సినీయర్‌ నాయకులు అంబర్‌సింగ్‌, బిక్షపతి, అంజయ్య, అంబర్‌సింగ్‌, రమేష్‌, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు