భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదం నెలకొంది. పుస్తకాలకు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెండలపాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్తకాల కోసం తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. పుస్తకాలు కొనేందుకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో.. సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సుధీర్ తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.