Monday, April 29, 2024

‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కథనానికి స్పందన..

తప్పక చదవండి
  • నేటి నుంచి గ్రామాలలో ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తాం..
  • కొత్తూరు ప్రభుత్వ వైద్యాధికారి హరి కిషన్‌..

కొత్తూరు : కొత్తూరు మున్సి పాలిటీతో పాటు గ్రామాల లో నేటి నుంచి ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు తగిన వైద్య సేవలు అందిస్తామని కొత్తూ రు ప్రభుత్వ వైద్యాధికారి హరి కిషన్‌ అన్నారు. ఈ నేల 5న ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’లో ప్రచు రితమైన ‘పెరుగుతున్న కళ్లకలక కేసులు..పాటించాలి జాగ్రత్తలు’ అన్న కథనానికి డాక్టర్‌ హరి కిషన్‌ ఆదివారం స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కళ్ల కలక కేసులు ఎక్కువ శాతం మందికి వస్తున్నాయని తెలిపారు. వ్యాధి ఇంకా వ్యాప్తి చెందకుండా గ్రామాలలో ప్రత్యేక మెడికల్‌ క్యాంపుల తోపాటు ప్రజలకు వ్యాధి పై అవగాహన కల్పించెందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేటి నుంచి ప్రతి గ్రామంలో మెడికల్‌ సిబ్బంది ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వ్యాధి పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు సూచిస్తారని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు