- ముఖ్య అతిథిగా రానున్న చంద్రబాబు
గుంటూరు : రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేందప్రసాద్ ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సదస్సు జరగనుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్స్ పాల్గొనాలని రాజేందప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావుల పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధులు, అధికారాలను దొంగిలించి రూ.3 కోట్ల 50 లక్షల గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అందుకే రాజకీయాలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు వైవీబీ రాజేందప్రసాద్ వెల్లడించారు.