Monday, April 29, 2024

అత్వేల్లి ప్రభుత్వ పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు

తప్పక చదవండి

మేడ్చల్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రాష్ట్రీయ ఏక్తా దివస్ ను మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఉన్న అత్వేల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా కలిసిమెలిసి కులమత బేధాలు లేకుండా ఉండాలని రాష్ట్రీయ ఏకతా ప్రతిజ్ఞ చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ సర్దార్ పటేల్ వల్ల ఈ దేశం సమైక్యంగా ఉందని అన్నారు. ఎన్నో సంస్థానాలని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేసినటువంటి మహానుభావుడు సర్దార్ పటేల్ అని తెలిపారు. వారి యొక్క జీవిత విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గడప నవీన్, పద్మలత, వసీం, మహేష్, ఉమా భారతి, స్వరూపాదేవి, రేణుక, స్వరూపారాణి, శ్రీదేవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు