Wednesday, April 17, 2024

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

తప్పక చదవండి
  • ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే..
  • ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు..
  • కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..?
  • అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు
  • మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని..

హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… 58 జీవో ప్రకారం పేదవారి ఇల్లు రెగ్యులరైజ్‌ చేసినం.. పెన్షన్‌లు ఇస్తున్నాం.. డబల్‌ బెడ్‌ రూంలు కట్టి ఇస్తున్నాం, షాది ముబరక్‌, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం’ అన్నారు.. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించామన్నారు. ఇవి పప్పు, బెల్లంలాగా ఎవరికి పడితే వారికి పంచడానికి ఉండదని తెలిపారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర అయ్యేదని.. ఇప్పుడు ఒక్కో డబల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మించడానికి 9 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ చాలా మాట్లాడుతున్నారని… కానీ పేదల కోసం ఏవిూ చేయరని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇస్తామని.. ఎవరు భయపడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మహిళపై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని ఓ మహిళ తలసానిని కోరారు. మహిళ విజ్ఞప్తిపై మంత్రి సరైన సమాధానం చెప్పకపోగా.. ఆమెపై సీరియస్ అయ్యారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ఇల్లు కట్టిస్తున్నారా అని తిరిగి మంత్రి ఆ మహిళను ప్రశ్నించారు. మహిళ తనకు ఇల్లు కావాలని కోరగా తనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తలసాని తీరు బాగా లేదని చర్చించుకుంటున్నారు..

- Advertisement -

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ను మురికి వాడలు లేని నగరంగా మార్చాలన్న సంకల్పంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూముల నిర్మాణాన్ని చేపట్టింది. మురికి వాడల్లో గుడిసెలు తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్రూములు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ లో దాదాపు 17 కోట్ల అంచనాతో 210 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది రాష్ట్ర సర్కారు. ఈ నిర్మాణ సముదాయాన్ని గురువారం రోజు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 210 డబుల్ బెడ్ రూముల నిర్మాణానికి మొత్తంగా రూ. 16.27 కోట్లు ఖర్చు అయింది. రూ. 15.5 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు. వాటర్ ట్యాంక్, విద్యుత్ సరఫరాతో పాటు 15 దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా షట్టర్ లు నిర్మించారు. ఈ రెండు పడక గదుల ఇళ్ల సముదాయానికి ‘డిగ్నిటీ కాలనీ’గా నామకరణం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు