- టాస్ గెలిచి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
- వరల్డ్కప్ సెమీస్లో ఇవాళ న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది.
- వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్
- ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండానే రంగంలోకి దిగుతున్నాయి.
ముంబై : వరల్డ్కప్ తొలి సెమీస్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. న్యూజిలాండ్తో వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్కు రోహిత్ సేన ఎటువంటి మార్పులు చేయలేదు. కివీస్ జట్టు కూడా ఈ మ్యాచ్కు ఎటువంటి మార్పులు చేయలేదు. పిచ్ బాగుందని, స్లోగా కూడా ఉందని కెప్టెన్ రోహిత్ పేర్కొన్నాడు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాళ్లమని కివీస్ కెప్టెన్ విలియమ్స్సన్ తెలిపాడు.