Sunday, May 5, 2024

తెలంగాణలో యూరియా నిల్వలు ఏవి?

తప్పక చదవండి
  • నూతన యూరియా పాలసీ ఏమైంది?
  • లోక్‌సభలో యూరియా సమస్యపై మండిపడిన ఎంపీ నామ
    ఖమ్మం : లోక్‌సభలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి , ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో గళం విప్పి, మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామ యూరియా సమస్యపై తెలంగాణ బిడ్డగా అన్నదాతల తరఫున తీవ్ర స్ధాయిలో గర్జించడం చర్చ నీయాంశమైంది. తెలంగాణాతో సహా దేశ వ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అవస్ధపడుతుంటే కేంద్రం ఏం చేస్తుందని నామ నిలదీశారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అన్నదాతలు యూరియా లభించక తిప్పలు పడుతున్నా కేంద్రానికి పట్టకపోవడమేమిటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. వ్యవసాయ సీజన్‌లో వ్యవసాయ రంగంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతు న్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం ఏమి పట్టనట్లు వ్యవహరించ డమేమిటని ధ్వజ మెత్తారు.తెలంగాణాతో సహా దేశ వ్యాప్తంగా యూరియా కొరత నివారించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. రైతులందరికీ యూరియా సరఫరా చేసేందుకు ఏమేమి చర్యలు తీసుకున్నారో.. ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న సమగ్ర ప్రణాళికను వెల్లడిరచాలని నామ పట్టుబట్టారు. తాను యూరియా సమస్యపై వివరాలు అడిగితే కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. అసలు దేశ వ్యాప్తంగా ఎంత యూరియా కావాల్సి ఉంది? ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న కార్యాచరణ ఏమిటని ప్రశ్నించారు. యూరియాపై సబ్సిడీకి సంబంధించి గత ఐదేళ్లలో రాష్ట్రాలకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం వివరాలను రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల వారీగా సమగ్రంగా ఇవ్వాలని కోరితే అసమగ్రంగా ఇచ్చారని, ఇది కరెక్ట్‌ కాదన్నారు. నూతన యూరియా పాలసీ విధానం తీసుకువచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం ప్రగతి సాధించారో తెలియజేయాలని కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. సప్లిమెంటరీ ప్రశ్న అడుగుతూ రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో మాట్లాడితే ఆక్షేపిస్తున్నారని, దేశంలో అన్నదాతల ఆక్రందనలను కేంద్రం దృష్టికి తీసుకువస్తుంటే రాజకీయాలు చేస్తున్నారని అనడం సబబుగా లేదన్నారు. దేశంలో ఎక్కడా 100 శాతం యూరియా సరఫరా జరగడం లేదన్నారు. దిగుమతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలియ జేయాలని నామ డిమాండ్‌ చేశారు.దేశంలో ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు యూరియా అందించేందుకు తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. ఈ సందర్బంగా కేంద్ర ఎరువుల శాఖా మంత్రి మన్సుఖ్‌ మాండవియ ఇచ్చిన సమాధానంపై నామ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఎరువులపై రాష్ట్రాల వారీగా ఇచ్చిన సబ్సిడీ వివరాలను అడిగితే సమగ్ర సమాచారం ఇవ్వకుండా సింపుల్‌గా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎరువులను స్వదేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు దిగుమతుల ద్వారా యూరియా సరఫరాను మెరుగుపర్చడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. నూతన యూరియా ఫాలసీ దేశాన్ని స్వయం సమృద్ధిగా చేయడానికి దోహదపడు తుందన్నారు. 201819లో ఎరువులపై రూ.73,435.21 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. అలాగే 202122లో రూ. 1,57,640.09 కోట్లు, 2022`23లో రూ .2,54,798.93 కోట్లు సబ్సిడీగా ఇచ్చినట్లు చెప్పిన కేంద్ర మంత్రి రాష్ట్రాలు,కేంద్ర ప్రాంతాల వారీగా గణంకాలు వెల్లడిరచకపోవడం పట్ల ఎంపీ నామ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు