Wednesday, May 8, 2024

వట్టె జానయ్య యాదవ్ పై గొడ్డళ్లు, కత్తులతో దాడి

తప్పక చదవండి
  • జానయ్య కు తృటిలో తప్పిన ప్రమాదం
  • బి.ఎస్.పి కార్యకర్తకు తీవ్ర గాయాలు
  • ఆత్మకూర్ (ఎస్) గట్టికల్ గ్రామంలో ఉద్రుక్తత

సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు (ఎస్) మండలం గట్టికల్లు గ్రామంలో ఆదివారం రాత్రి బిఎస్పి సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ పై సుమారు ఏడు గంటల సమయంలో గోడ్డల్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో వట్టె జానయ్య తృటిలో తప్పించుకోగా, పక్కనే ఉన్న బీఎస్పీ కార్యకర్త కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసింది బి.ఆర్.ఎస్ కార్యకర్తలు అని బీఎస్పీ పార్టీ నాయకులు చెప్తున్నారు.దాడి ఘటన పై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని,దాడి చేసిన వారిపై వట్టె జానయ్య యాదవ్ ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదని భాదితులు తెలిపారు.పోలీసుల పనితీరుకు గ్రామ ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు