- ఇజ్రాయెల్కు వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
వాషింగ్టన్ : హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించనున్నారు. ఇజ్రాయెల్కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. గాజాకు సహాయం చేసే విషయంలో ఓ ప్రణాళికను రూపొందించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.