- డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు
- రోడ్సేఫ్టీ అథారిటీ ఛైర్మన్గా అంజనీకుమార్
- హోంగార్డు ఐజిగా స్టీఫెన్ రవీంద్ర
- జైళ్లశాఖ ఐజిగా సౌమ్యామిశ్రా
రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. మాజీ డీజీపీ అంజనీకుమార్ ను రోడ్ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు. జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రాను నియమించారు. హోంగార్డు ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారు. రైల్వే డీజీగా మహేశ్ భగవత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ డీజీగా… ఎస్బీఐ చీఫ్ గా సుమతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిషేక్ బిస్తీని నియమించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డినినియమించారు. ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమిచంారు. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ చీఫ్ గా శిఖా గోయల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరు అధికారులకు పదోన్నతులు కల్పించారు.
బదిలీలు అయిన ఐపీఎస్లు వీళ్లే..
- రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా
- రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీకుమార్
- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్
- ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
- స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్
- జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా
- సీఐడీ చీఫ్గా శిఖా గోయెల్
- రైల్వే & రోడ్ సేఫ్టీ డీజీగా మహేశ్ భగవత్
- తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అనిల్కుమార్
- ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి
- ఐజీ పర్సనల్గా చంద్రశేఖర్ రెడ్డి
- హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ
- సీఐడీ డీజీగా రమేశ్ నాయుడు
- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేశ్
- ఏసీబీ డైరెక్టర్గా ఏఆర్. శ్రీనివాస్
- సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర
- హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషి
- ఎం.శ్రీనివాసులు (డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు)
- హోంగార్డు ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
- ఎస్బీఐ చీఫ్గా సుమతి