Friday, April 26, 2024

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు..

తప్పక చదవండి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు.

- Advertisement -

మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశమని పండితులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, కంకణభట్టార్‌, ఎపి.శ్రీనివాసదీక్షితులు, ఆగమ సలహాదారులు, సీతారామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు