భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. దక్షిణాఫ్రికా-భారత్ల మధ్య డర్బన్లోని కింగ్స్మీడ్ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 12వ తేదీ మంగళవారం గెబారాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా జరగడం అనుమాన మేనని తెలుస్తోంది. టాస్ కుదరక పోవడంతో డర్బన్లో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేశారు. ఇది అభిమా నులను నిరాశకు గురి చేసింది. ఇప్పుడు మంగళవారం జరగనున్న రెండో టీ20కి కూడా వర్షం అంత రాయం కలుగుతుందని సమాచారం. భారత్-ఆఫ్రికా రెండో టీ20 మ్యాచ్ రోజు. వర్షం పడే అవకాశం 45 శాతం ఉంది. అయితే, మరికొద్ది నెలల్లో టీ20 ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో ఆటగాళ్లకు ఇది పెద్ద దెబ్బగా మారనుంది.భారతదేశం ఙం దక్షిణాఫ్రికా 2వ టీ20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీం హాట్స్టార్ మ్యాచ్ లను ఆన్లైన్లో ఉచితంగా చూడొ చ్చు. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ భారత కాలమాణం ప్రకారంర రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు టీ20 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నందున రెండు మ్యాచ్లు గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. భారత టీ20 జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్). వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యా దవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్. ఇప్పటి వరకు, దక్షిణాఫ్రికా మరియు భారత దేశం మధ్య 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగాయి, వీటిలో టీం ఇండియా 13 మరియు దక్షిణాఫ్రికా 10 గెలిచా యి, 2 మ్యాచ్ లు ఫలితం లేకుండానే ఉన్నాయి. దక్షిణాఫ్రికా మైదానంలో ఇరు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరగగా, అందులో భారత జట్టు 5, ప్రొటీస్ 2 మ్యాచ్లు గెలి చాయి. గతేడాది ప్రొటీస్ గడ్డపై జరి గిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.