సూర్యాపేట : ఎన్నికల నిర్వహణలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ. రాజేంద్ర ప్రసాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ లోని గోదామును పరిశీలించారు. ఎన్నికల అనంతరం ఈ.వి.ఎం లను బద్రపరచనున్న ఈ.వి.ఎం స్ట్రాంగ్ రూమ్స్ కేంద్రాలను పరిశీలించారు. పటిష్ఠమైన పోలీసు భద్రత మరియు అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్స్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలోకి అనుమతి లేని ఇతరులు ఎవరిని కూడా అనుమతించవద్దని సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఈ.వి.ఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశా%శీ% అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన అర్ముడ్ గార్డెన్ తనిఖీ చేసి అప్రంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వెంట డిఎస్పి నాగభూషణం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎలక్షన్ ఇన్స్పెక్టర్ మహేష్, పతన ఇన్స్పెక్టర్ రాజశేఖర్, రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ ఉన్నారు.