Saturday, May 4, 2024

సకల జనుల సమరంతోనే తెలంగాణ

తప్పక చదవండి
  • తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన బిఆర్‌ఎస్‌
  • రాష్ట్రం ఏర్పాడ్డా ఫలాలు సామాన్యులకు అందడం లేదు
  • మోడీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు
  • హైదరాబాద్‌ మోడీ సభలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ : సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ’జల్‌, జంగల్‌, జమీన్‌ అంటూ కుమురం భీం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం వచ్చి కూడా ఫలితాలు అందరికీ అందని పరిస్థితి ఏర్పడిరదన్నారు. హైదరాబాద్‌లో మోడీ సభలో ఆయమన మాట్లాడారు. మోడీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్‌ 370 రద్దు చేసేవారు కాదు. మహిళా బిల్లు తెచ్చేవారు కాదు. ఎన్నో కీలక నిర్ణయాలు మోడీ తీసుకునేవారు కాదు. భారతీయుల గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధాని మోడీ. 3 దశాబ్దాల ప్రగతిని ఒక్క దశాబ్దంలోనే మోడీ సాధించారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఐదు సంవత్సరాలకు ఓ సారి ఎన్నికలు ఉండాలి తప్ప, ఐదేళ్ల పాటు ఎన్నికలు జరగడం సరికాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని అన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే ఆర్టికల్‌ 370 రద్దు, త్రిపుల్‌ తలాక్‌ లాంటివి కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదని అన్నారు. రామమందిరం నిర్మించగలిగేవారు కాదని అన్నారు. దేశ ప్రయోజనాలే మోడీని నిర్దేశిస్తాయి కానీ, ఎన్నికల ప్రయోజనాలు కాదని అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోడీ కూడా హాజరు కాగా, ఆయనపై ప్రశంసలు కురిపించారు. మోడీ అధికారంలోకి వచ్చాకే ఉగ్రదాడులు నియంత్రించ గలిగారని అన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోడీ ధైర్యం నింపారని కొనియాడారు. దేశంలో ఉన్న అత్యధిక జనాభా బీసీలు. మోడీ ప్రభుత్వం బీసీలను నోటితో చెప్పి ప్రేమించలేదని, సీటుతో ఇచ్చి ప్రేమించిందని అన్నారు. మాటలతో కాకుండా, బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రేమించిందని అన్నారు. ప్రధాని మోడీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదు. మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్‌ 370, నోట్ల రద్దు చేసేవారు కాదు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి. మోడీ నాయత్వంలో బీసీల తెలంగాణ రావాలి. నాలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్‌ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోడీ‘ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘భాగవతం పుట్టిన నేల ఇది. ఈ నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోడీ నాయకత్వంలో బీసీలు తెలంగాణలో ఎదగాలి. బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దీనికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుంది. విజన్‌ 2047 లో భాగంగా ప్రపంచంలోనే భారత్‌ అగ్రగామి దేశం కావాలంటే.. మూడోసారి మోడీ సర్కార్‌ రావాలి. ఈ ఎన్నికల కోసం ప్రధాన మంత్రికి నేను అండగా ఉంటాను. తమ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, కె.లక్ష్మణ్‌, బండి సంజయ్‌ కు ధన్యవాదాలు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేనూ మీలా సామాన్యుడిలాగే ఆయన ప్రసంగాలు వినేవాడిని. ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే బాగుంటుందని అనుకునేవాడిని. మోడీ నాకెంతో ఇష్టమైన నాయకుడు. నా అన్న. నా పెద్దన్న లాగా నాకు ధైర్యం ఇచ్చి, రాజకీయాల్లో భుజం తట్టిన నాయకుడు మోడీ. ఇలాంటి వ్యక్తి పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు