Sunday, May 19, 2024

కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది

తప్పక చదవండి
  • నీటి హక్కులపై ఎవరూ నోరు మెుదపలేదు
  • నాగార్జున సాగర్ నిర్మాణంలో కుట్ర జరిగింది
  • బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం
  • పేరు వేరే ఉంది.. కట్టాల్సింది కూడా అక్కడ కాదు: కేసీఆర్

కోదాడ : రాష్ట్రంలో బీసీ కులాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, అభివృద్ధి సంక్షేమ పథకాలను బీసీలకు వర్తింపజేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కోదాడలో 10 కోట్ల రూపాయలతో బీసీ భవన్ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా జాగ్రత్తగా ఓట్లు వేయాలన్నారు. గతంలో పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేశారో ఆలోచించాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు బంగారం లాంటి తెలంగాణను ఆగం చేశారన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరు.. అది కాదని తెలంగాణ ప్రభుత్వం నందికొండ అని పెట్టుకుందని చెప్పారు. కట్టాల్సింది కూడా ఇప్పుడున్న జాగాలో కాదన్న కేసీఆర్ ప్రస్తుతం ఉన్న.. స్థానం నుంచి 20 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం అనే ఊరు వద్ద కట్టాల్సి ఉందని అన్నారు.

కానీ ఆనాడు గోల్‌మాల్ చేసి దాన్ని కిందకు తీసుకొచ్చారని తద్వారా.. తెలంగాణకు నీళ్లు తక్కువగా.. మిగతా ప్రాంతానికి నీళ్లు ఎక్కువగా వెళ్తున్నాయన్నారు. ఇది మూమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ పాపమేనని అన్నారు. నీళ్ల కోసం తాను కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. కోదాడకు గత మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని.. తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే బీఆర్ఎస్‌తో సాధ్యమవుతుందని చెప్పారు. ఒకరాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది.. ఆ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని బట్టే చెప్పవచ్చునని అన్నారు. భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో టాప్ ఉందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

పక్క రాష్ట్రానికి చెందిన డీకే శివ కుమార్ ఇక్కడికి వచ్చి కళ్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ తాము 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే.. తమ రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పుకోవటానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రైతు బంధు వృథా అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారని.. కాంగ్రెస్‌ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు. కోదాడ బీసీ చైతన్యం ఈ ఎన్నికల ద్వారా బయటపడాలని కోరారు. మల్లయ్య యాదవ్ నుంచి ఓడించాలని కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలను ఓడగొట్టాలని సూచించారు. జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందని.. కోదాడలో బీసీలు ఎక్కువగా ఉన్నందున రూ. 10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు