Thursday, May 16, 2024

త్వరలో గీతా కార్మికులకు రుణాలు ఇస్తాం : మంత్రి హరీశ్‌రావు

తప్పక చదవండి

సంగారెడ్డి : కేసీఆర్‌ వచ్చాక తాటిచెట్టుకి పన్ను రద్దు చేశామని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెల నెలా మామూళ్లు కట్టాలని, కానీ కల్లు డిపోల వైపు కన్నెత్తి చూడకుండా చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కేసీఆర్‌ రాబోయే రోజుల్లో గీతా కార్మికులకు లునాలు ఇప్పించే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్‌లో పడ్డాడు. ఓడిపోయిన చింతా ప్రభాకర్‌ జనాలతోనే ఉన్నాడని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో జగ్గారెడ్డి ఒక్క ఊరు కూడా తిరగలేదని విమర్శించారు. మూడు కోట్ల రూపాయలతో ట్యాంక్‌ బండ్‌ పై సర్దార్‌ పాపన్న గౌడ్‌ విగ్రహం పెడుతున్నామన్నారు. గౌడల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందన్నారు. శ్రీనివాస్‌ గౌడ్‌, స్వామి గౌడ్‌లకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పని చేసే వారిని దీవించాలని విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు