- జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే..
సూర్యాపేట : ఎన్నికల నిర్వహణలో రూట్ మొబైల్ విధులు ప్రధాన్యమైనవి అని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రం లో గల పబ్లిక్ క్లబ్ హాల్ లో రూట్ మొబైల్స్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించి విధులపై సలహాలు, సూచనలు అందించారు.ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరిలించడం, ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం విధులు చాలా ముఖ్యమైనవని తెలిపారు. ఎలాంటి అవరోధాలు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అని, పోలింగ్ విధులలో ఉన్న సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వికాస్ ఫార్మసీ కళాశాల లో సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్ సిబ్బంది తో మాట్లాడి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ఆర్మ్ సిబ్బంది ఎవ్వరూ పోలింగ్ బూత్ లోకి వెళ్ళవద్దు అని సూచించారు.ఎవ్వరిపై లాఠీ చూపవద్దు అని కోరారు.స్థానిక అధికారుల పూర్తి సమాచారం ఉండాలన్నారు.వెంట డిఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్, అశోక్, సిబ్బంది ఉన్నారు.