Tuesday, April 30, 2024

చిలిపిచేడ్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌..

తప్పక చదవండి

చిలిపిచేడ్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చిలిపి చేడ్‌ మండలంలో ప్రశాంతంగా ముగిశాయి.మండలంలో 87 శాతం ఓట్లు పోల్‌ అయినట్లు అధికారులు తెలిపారు. చిట్కుల్‌ గ్రామంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం మహిళా ఓటర్లను,చూపరులను ఆకర్షింప చేసింది.ఓటు వేయడానికి వచ్చిన మహిళలకు బొట్టు పెట్టి,పూలతో స్వాగతం పలికారు.తెలంగాణ సంస్కృతిలో బోనాలను ఏర్పాటు చేశారు.అక్కడే ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటు వద్ద ఓటర్లు ఫోటోలు దిగుతూ ఆనందించారు.అదేవిధంగా ఇక్కడ బ్రెయిలీ లిపి ద్వారా ముగ్గురు అంధ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 90 శాతం ఓట్లు పోల్‌ అయినట్లు అదికారులు తెలిపారు.సోమక్క పేట్‌ లో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఓటర్ల ను ఆకర్షించే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు