పర్వతగిరి(ఆదాబ్ హైదరాబాద్): ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ విభిన్న రంగాల్లో దివ్యాంగులు రాణించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐఏఎస్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని జిల్లాలోని దివ్యాంగులకు ఇటీవల వివిధ క్రీడాంశాల్లో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించగా బహుమతులు, ప్రశంసా పత్రాల ప్రదానోత్సవం అంబేద్కర్ భవన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర బదిరుల ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ జే.లక్ష్మీ నరసమ్మ పాల్గొని మాట్లాడుతూ! జిల్లాస్థాయిలో మా పాఠశాల పిల్లలు తమ ప్రతిభను చూపి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, జిల్లా కలెక్టర్ చే, బహుమతులు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.