Wednesday, May 15, 2024

కలిసి పనిచేస్తాం

తప్పక చదవండి
  • సీఎం రేవంత్‌తో నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ భేటీ
  • రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ
  • నిధుల విడుదల… అభివృద్దికి సహకరించాలి : సీఎం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : సచివాలయంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ కుమార్‌ బేరి బృందం ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్కలతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై చర్చించారు. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో`ఆపరేటివ్‌ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీతి ఆయోగ్‌, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. రాష్టాభ్రివృద్ధి, కీలక రంగాలకు సంబంధించి ప్రాధాన్యతలను, రాష్ట్ర అవసరాలను ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతుగా సహకారమందిస్తామన్నారు. కేంద్రం నుంచి అందవలసిన న్యాయమైన కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్టాన్రికిచ్చే నిధులు, వనరుల మంజూరు గురించి చర్చించారు. ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో 16వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల కేటాయింపు పెరిగేలా చూడాలన్నారు. ఆరోగ్యం, విద్యలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయింపు పెంచాలన్నారు. ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్‌ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌కు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న రూ.1800 కోట్ల నిధుల విడుదల గురించి చర్చించారు. వినూత్న పాలనా పద్ధతులు, విజయవంతమైన నమూనాలను పరస్పరం సహకరించుకోవాలని అంగీకారం తెలిపారు. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మెరుగైన పద్ధతులను అవలంబించాలని నీతి ఆయోగ్‌ సూచించడం జరిగింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్సెస్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి, రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సులను అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించాలని నిర్ణయించారు. సోలార్‌ ఎనర్జీని వినియోగించుకోవడంపై సమావేశంలొ చర్చించి రాష్టాన్రికి సహకరించాలని కోరింది.

చర్చల్లో భాగంగా రాష్ట్ర సామర్ద్యాలను పటిష్టం చేయడానికిగాను స్టేట్‌ ఇన్ట్సిట్యూట్‌ అఫ్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ (ఎస్‌.ఐ.టి) ను రాష్ట్రలో ఏర్పాటుపై దృష్టి సారించారు. అంతర్జాతీయ అత్యుత్తమ స్థాయిలతో మోడల్‌ ద్వారా సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ మరియు నమామి గంగే వంటి ప్రోజెక్టుల మాదిరిగానే మూసి రివర్‌ ఫ్రంట్‌ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్స్‌ ఏర్పాటు కోసం సహకరించాలని కోరారు. ల్గªదరాబాద్‌ ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేందప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని భాగస్వామ్యంతో కలసి పనిచేయాలని నిర్ణయం. నీతి ఆయోగ్‌ పాలక మండలిలో రాష్ట్ర భాగస్వామ్యం కావాలని నీతి ఆయోగ్‌ కోరింది. నిర్మాణాత్మక మద్దతు మరియు సహకారం నీతి ఆయోగ్‌ కు అందిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సమావేశములో నీతి ఆయోగ్‌ నుండి వైస్‌ చైర్మన్‌ సుమన్‌ కుమార్‌, మెంబెర్‌ విజయ కుమార్‌, డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ కుమార్‌, డైరెక్టర్‌ అభినేష్‌ డాష్‌, ముత్తు కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు