ప్రపంచంలోని హిందూవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపించనుంది. అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. శ్రీరాముడిని బాల రాముడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటక శిల్పి తయారుచేసిన శ్రీరాముడి ప్రతిమను ఆయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.