- కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ బస్వరాజ్ గౌడ్ తదితర నాయకులు
- కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెద్దాం… దగా పడ్డా తెలంగాణకు విముక్తి కల్పిద్దాం
- కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
జిల్లేడు చౌదరిగూడెం : కాంగ్రెస్ పార్టీతోనే అట్టడుగు వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని తెలం గాణలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచే యాలని టిపి పీసీసీ అధ్యక్షులు ఏముల రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగూడెం, కొందుర్గు మండ లాలనుండి అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులుటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జిల్లేడు చౌదరిగూడెం మండలం నుండి మాజీ ఎంపిపి బోడంపాటి బస్వరాజ్ గౌడ్, మాజీ వైస్ ఎంపిపి చంద్రబాబు గౌడ్, ఎదిర సర్పంచ్ రాపోల్ బాలరాజ్, కాస్లాబాద్ సర్పంచ్ మొకర్ల గోపాల్, కొందుర్గు సర్పంచ్ కావలి ఆదిలక్ష్మి యాదయ్య లతో పాటు తమ అనుచ రులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు టి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండు వాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. చేతుల మీదుగా కాం గ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సమయం ఆసన్నమయిందని ప్రతి ఒక్కరు కలసిక ట్టుగా పనిచే యాలని అన్నారు. కేసీఆర్ పాలనలో బందీ అయిన తెలంగాణ కు విముక్తి కల్పంచాలని కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తేవ డమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో జిల్లేడు చౌదరిగూడ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.