Sunday, May 19, 2024

అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరికలు..

తప్పక చదవండి

మహబూబ్ నగర్ : అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నరు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బికి రెడ్డి కాలనీకి చెందిన పలువురు బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ సంక్షేమ పథకాలు గడపగడపకు అందుతున్నాయని ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా తాము అండగా ఉంటానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మెజార్టీతో గెలుస్తామని, జిల్లాలో 14 నియోజకవర్గాలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది అన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకపోయినా.. ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్లు దండుకోవడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గత పది సంవత్సరాలలో పాలమూరును హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేశామని, మళ్ళీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కౌన్సిలర్ అయిన గౌడ్, కాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన కార్యకర్తలు అంబుజా దేవి, శాంతమ్మ, రాధ, మాధవి, పుష్ప, బుగ్గప్ప, శేఖర్, నరేష్, ఉదయ్, వెంకటేష్, అమర్, వీరేష్, ప్రశాంత్, నవీన్, ఫయాజ్, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు