Saturday, April 27, 2024

భాజాపా పార్టీ బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం

తప్పక చదవండి

మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని, భాజపా పార్టీ బూత్ అధ్యక్షులకు రానున్న ఎన్నికల సన్నద్ధం పై దశనిర్దేశం చేశారు. శుక్రవారం మేడ్చల్ పట్టణంలో బిజెపి పార్టీ రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ సురేష్ రెడ్డి హాజరై మాట్లాడారు.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నీటిమూటలని, ప్రజలు బిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. దళిత బంధు, బీసీ బంధు, వంటి పథకాలు కేవలం బిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తాయని సామాన్య ప్రజలకు కాదని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి ప్రజల సమస్యలను పక్కన పడేసి, స్వంత లాభం కోసం రాజకీయ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, ఘట్కేసర్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్ హంసా రాణి కృష్ణ గౌడ్, నాయకులు వంశీ, అర్జున్ తదితులున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు