Saturday, May 4, 2024

రూ.40 వేల కోట్ల పెట్టుబడులు..

తప్పక చదవండి

దావోస్‌లో మెరిసిన తెలంగాణ..

  • 35 వేలకు పైగా తెలంగాణలో కొలువులు
  • ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపే
  • ఇన్వెస్ట్‌?మెంట్‌ ల ఆకర్షణలో రాష్ట్రం ?సరికొత్త రికార్డు
  • దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం
  • స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై అదానీతో సుముఖత
  • గోడి ఇండియా భారీ ప్రాజెక్టు- రూ.8000 కోట్లు
  • తెలంగాణలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌-రూ.9,000 కోట్లు
  • గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌- వెబ్‌ వెర్క్స్‌ రూ. 5,200 కోట్లు
  • భారీ పెట్టుబడులకు గోద్రెజ్‌ కంపెనీ ఆసక్తి

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్‌ లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు. తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్‌ అవగాహన ఒప్పందాలు ఎంవోయూలు చేసుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు సమక్షంలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ సీఈవో ఆశిష్‌ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

- Advertisement -

స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్‌ అదానీతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు :-
తెలంగాణలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్‌ వల్లిలో అదానీ కొనెక్స్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండిరగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పార్క్‌ లో కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్స్‌, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్‌ అదానీతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు.

గోడి ఇండియా భారీ ప్రాజెక్టు- రూ.8000 కోట్ల పెట్టుబడులు
గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్‌ బ్యాటరీ సెల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌ లో 12.5 జిడబ్ల్యూహెచ్‌ (గిగావాట్‌ ఫర్‌ అవర్‌) సామర్థ్యంతో బ్యాటరీ సెల్‌ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్‌ గోడి సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. అదే వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో గోడి ఇండియా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రాబోయే అయిదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్‌, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ ), గిగా స్కేల్‌ సెల్‌ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్‌ అసెంబ్లింగ్‌ లైన్‌ తయారు చేసి, రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు.

తెలంగాణలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌-రూ.9,000 కోట్ల పెట్టుబడులు
జేఎస్‌ డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌ డబ్ల్యూ నియో ఎనర్జీ, తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, జేఎస్‌ డబ్ల్యూ నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం ఎంవోయూలు కుదిరింది. దావోస్‌ లో జేఎస్‌ డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ 1,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జేఎస్‌ డబ్ల్యూ ఎనర్జీ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉన్నది. ఈ సంస్థ థర్మల్‌, హైడ్రో, సౌర వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్‌ రంగ విద్యుత్‌ సంస్థగా, ఇది 4,559 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. జేఎస్‌ డబ్ల్యూ నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేస్తుంది.

తెలంగాణలో గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌- వెబ్‌ వెర్క్స్‌ రూ. 5,200 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌ వెర్క్స్‌ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడిరది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్‌ మౌంటెన్‌ అనుబంధ సంస్థ వెబ్‌ వెర్క్స్‌ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఐరన్‌ మౌంటేన్‌ సీఈవో విలియం మీనీ, వెబ్‌ వెర్క్స్‌ సీఈవో నిఖిల్‌ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్‌ వెర్క్స్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్‌ వర్కింగ్‌-హెవీ డేటా సెంటర్‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే కొన్ని సంవత్సరాలలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది.

భారీ పెట్టుబడులకు గోద్రెజ్‌ ఆసక్తి
దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాదిర్‌ గోద్రెజ్‌తో కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్‌ కంపెనీ ఆసక్తిని చూపింది. వ్యూహత్మకమైన పెట్టుబడులతో తెలంగాణ అడుగు పెట్టాలని చూస్తున్నామని నాదిర్‌ గోద్రెజ్‌ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఫామ్‌ ఆయిల్‌ మిషన్‌ను నడపడంలో గోద్రెజ్‌ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నది. ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ. 270 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఆయిల్‌ ఫామ్‌ ప్రాసెసింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తోంది. మలేషియాకు చెందిన అతి పెద్ద పామాయిల్‌ కంపెనీ సిమ్‌ డార్బీ తో గోద్రెజ్‌ జాయింట్‌ వెంచర్‌ కుదుర్చుకుంది. తెలంగాణలో రూ.1000 కోట్ల కెమికల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్‌ అంగీకరించింది. దీంతో పాటు స్కిల్‌ డెవెలప్‌ మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌, క్రీమ్‌లైన్‌ డెయిరీ తదితర రంగాలలో పెట్టుబడుల్లో పెట్టేందుకు అనువైన అంశాలపై చర్చించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు