Sunday, May 19, 2024

సోనియా లేకపోతే..సీఎం కుర్చీ ఎక్కడిది..?

తప్పక చదవండి
  • సోనియా లేకపోతే తెలంగాణ రాష్ట్రము వచ్చేది కాదు
  • సోనియా కాళ్లు మొక్కిన తర్వాత రోజే మాట మార్చాడు
  • బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు
  • ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయ్
  • కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరిపై లక్షన్నర అప్పు
  • కర్నాటకలో ఐదు గ్యారెంటీలు బేషుగ్గా అమలు చేస్తున్నాం..
  • కాంగ్రెస్ విజయభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం ఇందిరమ్మకు సొంతం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం భాగంగా ఆదివారం సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి ఒక్కరిపై రూ.లక్షన్నర అప్పు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రమని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నెహ్రూ, ఇందిరాగాంధీ ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పాలరని ఖర్గే తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ స్థాపించిన సంస్థలతో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందని ఖర్గే తెలిపారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చే 6 హామీలను తప్పక నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు.. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని ఖర్గే పేర్కొన్నారు. మహిళలకు ప్రతి నెలా ఖాతాల్లో రూ.2,500 వేస్తామని .. వరికి మద్ధతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్ధులకు యువ వికాసం కింద చదువుల కోసం రూ.5 లక్షలు ఇస్తామని ఖర్గే పేర్కొన్నారు. మోడీ పాలనలో కార్పోరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో అదానీ ఆదాయం మాత్రమే రెట్టింపు అయ్యిందని ఖర్గే దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ ఎవరో ప్రజలందరికీ తెలుసునని ఖర్గే ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వాలకు లేదని ఆయన మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోడీ గొప్పగా చెప్పారని మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని మోడీ అన్నారని.. కేసీఆర్, మోడీలు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే కేసీఆర్, మోడీలు ఇచ్చిన హామీలు మరిచారని ఆయన మండిపడ్డారు. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. ఆయన పాలనలో కార్పోరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని ఖర్గే ఆరోపించారు.

నీకు కూర్చీ ఎక్కడిది..?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందని, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌కు సీఎం కుర్చీ ఎక్కడిది? అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల ఆకాంక్ష, కోరిక, ఆశయాలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం తప్పా.. ఎవరూ బాగుపడలేదన్నారు. కుటుంబం అంతా ఏకమై, తెలంగాణ ప్రజలను బాధలకు గురి చేస్తుందన్నారు. ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి తప్పిన విషయం మొత్తం తెలంగాణ ప్రజలకే తెలుసన్నారు. కానీ సోనియాగాంధీ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సమాధి అవుతున్నా వెనక్కి తగ్గలేదని, తన మాటను నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫైవ్ గ్యారంటీస్‌ అమలవుతున్నాయని, తెలంగాణ ప్రజలను మధ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు అనుమానాలు రేకెత్తిస్తున్నారని, సందేహాలుంటే వచ్చి చూసుకోవచ్చని, ప్రజలను అడిగి తెలుసుకోవచ్చన్నారు.

బస్సు పెడతాం.. పోదాం..
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పి లగ్జరీ బస్సును ఏర్పాటుచేస్తామని, స్వయంగా ఆయనే దగ్గరుండి కర్ణాటకలో అమలవుతున్న ఫైవ్ గ్యారంటీస్‌పై లబ్ధిదారులతో మాట్లాడిస్తారని ఖర్గే స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియాగాంధీ కాళ్ళు మొక్కిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆమెతో కలిసి గ్రూపు ఫోటో దిగారని, అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆమెపైనా, వారి కుటుంబ సభ్యులైన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను విమర్శిస్తున్నారని, చివరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, కేసీఆర్ నిజ స్వరూపం ఇదేనని ఖర్గే చురకలంటించారు. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మిగులు బడ్జెట్ ఉంటే తొమ్మిదేళ్ళలో అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్‌ పరిపాలనీ తీరును విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు