Monday, May 6, 2024

అవకాశం ఇస్తే అండగా ఉండి.. అభివృద్ధి చేస్తా

తప్పక చదవండి
  • కాంగ్రెస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి యన్నం శ్రీనివాసరెడ్డి

మహబూబ్ నగర్ : అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని తెలంగాణ ప్రజల ఆశయాల నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు సిరాజ్ ఖాద్రి, కౌన్సిలర్లు వార్డు మెంబర్లు, ప్రచార కార్యదర్శి బెనహర్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు