Monday, May 6, 2024

జావెలిన్ త్రో తో భారత్ ఖాతాలో స్వర్ణం

తప్పక చదవండి
  • ఆసియా క్రీడల్లో అన్ను రాణి సూపర్ పర్ఫార్మెన్స్..
  • చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు..
  • జావెలిన్ ను 62.92 మీటర్లు విసిరిన పసిడి
    పతకం సాధించిన భారత్ క్వీన్..
  • భారత్ ఖాతాలో చేరిన 15వ గోల్డ్ మెడల్..

న్యూ ఢిల్లీ : భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ త్రో విసిరింది. 61.57 మీటర్లతో శ్రీలంక క్రీడాకారిణి నదీష దిల్హాన్ రజతం గెలుచుకుంది. చైనాకు చెందిన హుయిహుయి ల్యూ 61.29 మీటర్లతో కాంస్యం దక్కించుకుంది. కాగా, అన్ను రాణి గెలుచుకున్న స్వర్ణంతో, ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పతకాల సంఖ్య 15కి పెరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు