Sunday, May 5, 2024

ప్రజానేతకు ప్రాధాన్యత ఇవ్వండి..

తప్పక చదవండి
  • నీలం మధుకు తోడుగా కదిలిన రజకులు..
  • ఎమ్మెల్యేగా పోటీ చేయండి మీ వెంట మేముంటాం..
  • చాకలి ఐలమ్మ స్పూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదాం..
  • తెలంగాణలో అతి పెద్దదైన ఐలమ్మ విగ్రహం కాంశ్య చిట్కూల్ గ్రామంలో
    ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు..
  • నీలం మధుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి.. గెలిపించుకుంటాం..
  • కేసీఆర్ ను కోరిన పటాన్చెరువు నియోజకవర్గ మెజార్టీ రజకులు..

ప్రజా నాయకులుగా పేరు తెచ్చుకున్నవారు ఎప్పటికీ వారి గుండెల్లో నిలిచే ఉంటారు.. ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే తపిస్తూ ఉంటారు.. అలాంటి నాయకులు ప్రస్తుత కాలంలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.. ఈ కోవకి చెందిన నాయకుడే యంగ్, డైనమిక్ పొలిటీషియన్ నీలం మధు.. పఠాన్ చెరు నియోజక వర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య ఎక్కువుగా వినిపిస్తున్న పేరు నీలం మధు.. అనునిత్యం ప్రజల్లో ఉంటూ, ఎప్పటికప్పుడు వారి బాగోగులు చూసుకుంటూ పలు సేవా కార్యక్రమాలతో సాగిపోతున్న నీలం మధుకు నియోజకవర్గంలోని అన్ని వర్గాలనుండి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.. బీ.ఆర్.ఎస్. అధినేత కేసీఆర్ ఈసారి తప్పనిసరిగా నీలం మధుకే టికెట్ ప్రకటిస్తారని నియోజక వర్గ ప్రజలు భావించారు.. కానీ అధినేత నిర్ణయంతో వారంతా నిరాశకు గురి అయ్యారు.. అయితే తమకు తోడు, నీడగా ఉంటున్న నీలం మధు లాంటి నాయకుడిని గెలిపించుకుంటే తమ బ్రతుకులు బాగుపడతాయని వారు భావిస్తున్నారు.. ఇండిపెండెంట్ గా నైనా నిలబెట్టుకుని గెలిపించుకుంటామని సమావేశం నిర్వహించి శపథం పూనారు నియోజకవర్గ రజక సంఘం నేతలు.. ఇప్పుడీ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.. ఇప్పటికైనా కేసీఆర్ మనసు మార్చుకుంటారని వారు ఆశిస్తున్నారు..

హైదరాబాద్ : పఠాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పునరాలోచించాలని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు రజక సంఘం నేతలు.. చిట్కుల్ గ్రామంలో నీలం మధు ఏర్పాటుచేసిన ఐలమ్మ కాంస్య విగ్రహనికి ర్యాలీగా వెళ్లి పూలమల వేసి సమావేశం ప్రారంభించారు.. పఠాన్ చెరు మండలం, ఇస్నాపూర్ ఎక్స్ రోడ్, బాలాజీ ఫంక్షన్ హాల్లో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి వెంకటేష్ ఆధ్వర్యంలో పఠాన్ చెరు నియోజకవర్గ స్థాయి రజకుల ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు…

- Advertisement -

కాగా పఠాన్ చెరు బీ అర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తృటిలో అవకాశం కోల్పోయిన నీలం మధు ముదిరాజ్ కు సబ్బండ వర్గాల ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. నీలం మధుకు మద్ధతుగా అన్ని బీసీ వర్గాలు ఏకమవుతున్నాయి. ఐక్యమత్యంతో ముందుకు సాగి నీలం మధు ను ఎమ్మెల్యేగా గెలిపించాలని డిసైడ్ అవుతున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ ను ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ నీలంకు కేటాయిస్తే గెలిపించి మీ చేతిలో పెడతామంటూ భరోసా ఇస్తున్నారు. మరొక అడుగు ముందుకు వేసి అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని మా అందరి మద్దతు మీకే ఉంటుందని తేల్చి చెప్తున్నారు. నీలం మధుకు తోడుగా పఠాన్ చెరు నియోజకవర్గ మెజారిటీ రజక సంఘలు కదిలాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తమ సామాజిక వర్గం అంతా కదిలి నీలం మధును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్తున్నారు.

పఠాన్ చెరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, తమకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నీలం మధు బాటలోనే మేమంతా పయనిస్తామని రజకులు వెల్లడిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో కేసీఆర్ బీసీ వర్గాలను మోసం చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న రజకులకు ఒక టికెట్టు కూడా కేటాయించకపోవడం తప్పు పట్టారు.. పఠాన్ చెరు నియోజకవర్గంలో మెజారిటీ బీసీలున్నారని దానికి తోడు సబ్బండ వర్గాల పక్షాన నీలం మధు ముదిరాజ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారన్నారు. అటు మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ వారి గాధలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే ఉద్దేశంతో వారి పోరాటాన్ని గుర్తుచేసేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించుకొని పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీలంకు టికెట్ ఇస్తే అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు సాగి, భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో పోరాటం తమకు కొత్త కాదని చాకలి ఐలమ్మ వారసులుగా తమ వర్గం అంతా నీలం మధు పక్షాన నిలబడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తామంతా చొరవ తీసుకొని నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా మరిన్ని బహుజన సామాజిక వర్గాలను ఏకం చేసి సామాజిక న్యాయం, రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తామని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పఠాన్ చెరు మండల అధ్యక్షులు గణేష్, గుమ్మడిదల మండల అధ్యక్షులు వీరెష్, అమీన్పూర్ మండలాధ్యక్షులు నాగేష్, రామచంద్రపురం మండల అధ్యక్షులు నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య, లక్ష్మణ్, ఆశయ్య, రవి, సందీప్, గోపాల్, నారాయణ, సురేశ్, బాలకృష్ణ, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు