- వెల్లడించిన ఇస్రో చీఫ్ సోమ్ నాథ్..
- ఇతర గ్రహాలపై పై మిషన్లు ప్రారంభించే సత్తా భారత్ కి ఉంది..
- దేశప్రజలు ఎంతో మద్దతు ఇస్తున్నారు..
- ఇస్రోను చూసి భారత్ గర్విస్తోంది..
- ప్రయోగాలకు మరిన్ని పెట్టుబడులు కావాలి : సోమ్ నాథ్..
బెంగుళూరు : ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చంద్రయాన్-3 నుంచి భారీ విషయాన్ని ఆశిస్తున్నామని ఇస్రో చీఫ్ సోమ్నాథ్ వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడమే ఇస్రో లక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు భారత్ మరిన్ని ఇతర గ్రహాలపై కూడా మిషన్లను ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన మీడియాతో అన్నారు. ఇస్రో ప్రధానమంత్రి దార్శనికతను అమలు చేయగలుగుతోందని తెలిపారు. ఇక మరో విషయం ఏంటంటే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్కు సంబంధించి అన్నీ విషయాల్లో కూడా వందశాతం కరెక్ట్గా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఇస్రోను చూసి భారత్ మొత్తం గర్విస్తోందని, దేశప్రజలందరూ తమకు ఎంతో మద్దతు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి చారిత్రాత్మక మిషన్లో భాగస్వాములైనందుకు తనతో పాటు సహోద్యోగులందరూ కూడా గర్విస్తున్నారన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇక రాబోయే రోజుల్లో అంగారకుడితో పాటు శుక్రుడిపై కూడా పరిశోధనలు చేపట్టగలమని.. ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు. అయితే ఇందుకు మరింత పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపారు. స్పేస్ సెక్టార్లో విస్తరించి.. భారత్ను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అలాగే చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని చిత్రాల కోసం ఇస్రో బృందం ఆసక్తితో ఎదురుచూస్తోందన్నారు. ప్రస్తుతం చందమామపై శాస్త్రీయ అధ్యయనం, పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఆదిత్య ఎల్-1 మిషన్పై కూడా ఆయన స్పందించారు. దీన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ ఆదిత్య ఎల్-1 లాంచ్కు సంబంధించి చివరి తేదీని ఒకటి, రెండు రోజుల్లోనే ప్రకటించనున్నామని చెప్పారు. ఆదిత్య ఎల్-1 మిషన్ను నింగిలోకి పంపిన తర్వాత.. లాగ్రాంజ్ పాయింట్కు చేరుకునేందుకు దాదాపు 125 రోజుల వరకు పడుతుందని సోమ్నాథ్ తెలిపారు.
ఇదిలా ఉండగా చంద్రయాన్- విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు మరింత ఉత్సహాన్ని చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని అద్భుతాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్-3 ప్రాజెక్టు విజవంతం కావడంతో ప్రపంచ దేశాలన్ని భారత్వైపు చూశాయి. 2019లో చేపట్టిన చంద్రయాన్ -2 విఫలమైన సంగతి తెలిసిందే. అందులో నుంచి పాఠాలు నేర్చుకొని చంద్రయాన్-3 ని సక్సెస్ చేశామని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రధాని మోదీ.. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి అనే పేరును పెట్టారు. అలాగే ఆగస్టు 23ను కూడా జాతీయ అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారు.